
MADHURAVANI TELUGU MAGAZINE
త్రైమాస అంతర్జాల పత్రిక
ISSN 2471-688X
వ్యాస మధురాలు
నిర్వహణ: శాయి రాచకొండ | శ్రీనివాస్ పెండ్యాల
అప్పిచ్చి’వాడు -వైద్యుడు [సైకియాట్రీలో వింత కథలు-2]
గిరిజా శంకర్ చింతపల్లి
ఒకానొక యుద్ధం. నవీన మర మారణాయుధాలు రాని, కత్తులూ, గుర్రాలూ, రధాలూ, గదల యుద్ధ కాలం.
"ఆ" రాజ్య సైనికుడు కత్తి దూసి, "ఈ” రాజ్య సైనికుడిమీదికి పరుగెట్టుకుని వస్తున్నాడు, వాణ్ణి పొడవటానికి. ఇంతలో వెనకనించి ఒక బాణం వచ్చి వాడి తల నరికేసింది. ఆ తలతెగిన మొండెం, అదే వేగంతో ముందుకి నడిచి, ఎదుటి సైన్యం వీరుణ్ణి పొడిచి, ఆ తరవాత కింద పడింది. అక్కడ చచ్చి పడిఉన్న కొన్ని తలల్లో ఇంకా కోపంతో బిగబట్టిన పెదవులు, అలాగే కరుచుకుని ఉన్నాయి.
నమ్మశక్యం కావటంలేదు కదూ. మీరు నమ్మాల్సిందే ఇది నిజం.
మన మెదడు [Brain] లో ఉండే పదార్థాలు రెండు 1. న్యూరాన్. 2. న్యూరొగ్లియ. ముట్టుకుంటే టోఫూ లాగా ఉంటుంది. పట్టుకుంటే నొప్పి ఉండదు. 100 బిల్లియన్ కణాలుంటాయి అని అంచనా. కానీ ఆ కణాలు ఒకదానితో ఒకటి అనేకరకాలుగా కలుసుకుని కొన్ని కోటానుకోట్ల కన్నెక్షన్లు ఏర్పడతాయి. అవి ఎన్ని అంటే, మన పాలపుంతలో ఉన్న నక్షత్రాల సంఖ్య కంటే ఎక్కువ. కానీ ఇందులో మనం 20 శాతమే వాడతామని నమ్మిక. అదీ బాగా తెలివిగలవాళ్ళని పేరున్నవారు. మరి నూటికి నూరు పాళ్ళూ వాడితే వారి శక్తికి అంచనా కట్టగలమా?
శేషేంద్ర తొలి రచనలు - ఒక విహంగ వీక్షణం
విన్నకోట రవిశంకర్
సుదీర్ఘ కాలం సాహితీ జీవనం గడిపి, అనేక రచనలు చేసిన కవులు, రచయితల పరిణామక్రమం రెండు రకాలుగా ఉండవచ్చు. మొదటిది, వారి తొలి రచనలు తాజాదనం, కొత్తదనం, ఊహా వైచిత్రి, ప్రయోగం వంటి వాటితో తళుక్కున మెరిసి, ఆ మెరుపు తదనంతర రచనలలో క్రమంగా మాయం కావటం. తొలిరచనే అత్యంత ప్రసిద్ధి పొందినప్పుడు, దాని ప్రభావం తరువాతి రచనల మీద పడే అవకాశం ఉంది. అలాగే, తమకంటూ ఒక పాఠకవర్గం ఏర్పడ్డాక, వారిని సంతృప్తి పరిచే బాధ్యత కూడా వారి రచనలను ప్రభావితం చెయ్యవచ్చు. తెలుగులో మొదటి ప్రచురణతోనే విశిష్ట ప్రసిద్ధిపొందిన రచనలు శ్రీశ్రీ “మహాప్రస్థానం” , నవీన్ “అంపశయ్య” వంటివి కొన్ని ఉన్నాయి.
దీనికి భిన్నంగా, కొందరి రచనలలో కాలం గడిచేకొద్దీ పరిణతి, కూర్పులో నేర్పు, గాఢత వంటివి ఏర్పడి, తొలి రచనలకంటే మెరుగ్గా రూపుదిద్దుకుంటాయి. ఉదాహరణకి, ఇస్మాయిల్ గారి తొలి పుస్తకం కంటే, తరువాత వచ్చిన “చిలకలు వాలిన చెట్టు”, “రాత్రి కురిసిన రహస్యపు వాన” వంటి కవితా సంపుటాల్లో కవితలు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. తిలక్ “అమృతం కురిసిన రాత్రి” లో బాగా ప్రసిద్ధి పొందిన కవితలలలో చాలా వరకు ఆయన నలభైలలో ఉండగా అంటే 1960 ప్రాంతాల్లో రాసినవే. శివారెడ్డి గారి కవిత్వం విషయంలో కూడా తొలినాళ్ళ సంపుటాల కంటే ఇటీవలి కాలంలో వచ్చిన సంపుటాల్లోని కవితలే నాకు ఎక్కువగా నచ్చుతాయి.
ఎన్నేళ్ళుగా రాస్తున్నా, వారి రచనలలో పెద్దగా మార్పులేనివారు రూ కొందరుంటారు. వారు గురించి ప్రత్యేకంగా చెప్పుకునేదేమీ లేదు.
ఏది ఏమైనా, సుదీర్ఘకాలం రచనలు చేసినవారి తొలి రచనలను పరిశీలించటం ఆసక్తికరంగా ఉంటుంది. ఇదే ఉద్దేశంతో ప్రముఖ కవి, పండితుడు, ఆలోచనా శీలి, బహుగ్రంథకర్త గుంటూరు శేషేంద్ర శర్మ గారి తొలి రచనలలో విశేషాలు కొన్ని ప్రస్తావిస్తాను.
కరోనా కాటు
